Home » Minister Seethakka
Minister Seethakka: రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామని మంత్రి సీతక్క తెలిపారు. రాజకీయ రంగంతోపాటు అన్నిరంగాల్లో బలమైన శక్తిగా మహిళలు ఎదగాలని కోరుకున్నారు. రాజ్యాలు సొంతగా పాలన చేసేలా మహిళలు ఎదగాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
Congress: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పొంపొదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని తెలిపారు.
MinisterSeethakka: మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని మంత్రి సీతక్క తెలిపాపారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్లైన్లో పరిష్కరించే విధానాన్ని అవలంబించాలన్నారు. అర్హులైన ప్రతి గర్భినీ, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించాలన్నారు. ఆ దిశలో జిల్లా సంక్షేమ అధికారులను సిద్ధo చేయాలని మంత్రి సీతక్క చెప్పారు.
Minister Seethakka: బీజేపీ నేత రమేష్ బిధూరిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Minister Seethakka: కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పని చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
Minister Seethakka: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్లో లాయర్గా పనిచేశానని గుర్తుచేశారు. తాను మూడు సార్లు ప్రజా ప్రతినిదిగా పనిచేశానని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యంగులు ఉన్నారు. వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్లను కేటాయించిందని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు.