Home » MLC Kavitha
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి.. తిహాడ్ జైలులో ఉన్న కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్కు తెలిపింది.
Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ ఇంటరాగేషన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అరెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది.
Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత(K Kavitha) మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో(Liquor Scam) తాను బాధితురాలినని, రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు..
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా... ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుని కోరారు.
కల్వకుంట్ల కుటుంబంలో ఇటీవల ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకరు అరెస్ట్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్న రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో ఆయనను పోలీసులు రిమాండ్ చేయనున్నారు.