Home » New Delhi
కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిదండ్రులను కూడా వాడుకున్నారని పర్వేష్ వర్మ ఆరోపించారు. తన తండ్రి నడవగలిగినప్పటికీ కేవలం ఓట్ల కోసం ఆయనను వీల్చైర్లో తీసుకువచ్చారని చెప్పారు.
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై శుక్రవారంనాడిక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్షా సమీక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హోం మంత్రి ఆశిష్ సూద్, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
కోర్టుల్లో శిక్షలు పడి, నేరచరితులుగా ఉన్న చట్ట సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలా? వద్దా? అనే అంశం పూర్తిగా పార్లమెంట్ పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎల్జీ ప్రసంగానికి అడ్డుపడుతున్నారంటూ అధికార పక్షం ఆప్ ప్రతిపక్ష నేత ఆతిషీతో సహా 12 మంది ఎమ్మెల్యేలపై ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది.
సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా ఆయనను స్పీకర్ సీటుకు తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
సైన్బోర్డులపై యువకులు బ్లాక్ ఇంక్ స్ప్రే చేస్తూ మరాఠా సామాజ్ర స్థాపకుడు శివాజీ పోస్టర్లు అంటించడం ఇందులో కనిపిస్తోంది. శివాజీ తనయుడైన శంభాజీ మరాఠా సామ్రాజ్యానికి రెండో రాజుగా పాలన సాగించారు.
భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానినొకటి సుసంపన్నం చేసిందని అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారంనాడు జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనలో ప్రధాని మాట్లాడుతూ, భారత భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.
వేదికపై పవార్ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తుండగా మోదీ ఆయనకు సహకరించి ఆయన కూర్చీలో కూర్చున్న తర్వాత తాను కూడా కూర్చున్నాను. వాటర్ బాటిల్ మూత తీసి అందులోని నీటిని పవార్కు ఎదురుగా ఉంచిన గ్లాసులో పోసారు.
షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను ఆమోదించినట్టు తెలిపారు.