Home » Parliament
సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్ కు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు.
ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీ(BJP)లో అసంతృప్తి రగులుతోంది. బీజేపీని బలోపేతం చేసి పార్టీ కోసం కష్టపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరికి సీటివ్వాలంటూ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్లో గత కొన్నేళ్లుగా బీజేపీని గారపాటి సీతారామాంజనేయ చౌదరి బలోపేతం చేశారు. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో వివాదం రాజుకుంది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల(Parliment Elections) పై బీజేపీ (BJP) దృష్టి సారించింది. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. ప్లాన్లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చరిష్మాను లోక్సభ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతో బరాబర్ తాము ఓట్లను అడుగుతామని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ పేరు చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
Amit Shah Public Meeting: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ జోరు పెంచింది. ఈ ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. ఇందుకోసం వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు...
తెలంగాణలో తాము అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే నెలలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికలు ఎవరు ప్రధాని కావాలో నిర్ణయిస్తాయని చెప్పారు.
జిల్లాలో తమ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఏమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ (BJP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.
ఆదిలాబాద్లో లంబాడా బంజారాలకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తామని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ramesh Rathod ) అన్నారు. మాజీ ఎంపీ నగేష్ బీజేపీలో చేరిక, లోక్ సభ స్థానాన్ని ఆయనకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై సోమవారం నాడు బీజేపీ (BJP) నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఎంపీ లక్ష్మణ్ని ఆదిలాబాద్ నేతలు కలిశారు.
పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు.