Home » Peddapalli
మహా శివరాత్రి సందర్భంగా గోదావరినదిలో పుణ్య స్నానాలు చేయటానికి వచ్చిన భక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. బుధ వారం గోదావరినది తీరాన్ని పుట్ట మధు పరిశీ లించి భక్తులతో మాట్లా డారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తర లించేందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఆపడం లేదన్నారు.
సింగరేణి ఆర్జీ-1 యాజ మాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులతో బుధవారం ఆర్జీ-1 జీఎం లలిత్కుమార్ అధ్యక్షతన ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమా వేశం నిర్వహించారు. గుర్తింపు సంఘం ప్రతినిధులు వివిధ సమస్యపై చర్చించారు.
Shivalingas: మహాశివరాత్రి పర్వదినాన ఓ సూక్ష్మ కళాకారుడు తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నాడు. దాదాపు 109 శివలింగాలను చాక్పీసులతో తయారు చేశాడు. ఈ శివలింగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రభుత్వాసు పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం అడ్డగుంటపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీలకు ప్రస వాలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేస్తూ వివరాలు నమోదు చేయాలని, ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణీల తో మాట్లాడి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడా లని వైద్య సిబ్బందికి సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దప ల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎమ్మె ల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సం బంధించి 36 లొకేషన్లలో 108 పోలింగ్స్టేషన్లు ఉన్నాయన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎల్ఆర్ఎస్, ట్రేడ్ లైసెన్స్, రెవెన్యూ మేళాలో పలు సమస్యలు పరిష్కారమయ్యా యి. ఈనెల 10 నుంచి మంగళవారం వరకు మున్సిపల్ కార్యాలయంలో మేళాలు నిర్వహించారు. ఇందులో డ్యాక్యూమెంట్లలో వివిధ రకాల తప్పులు, ప్రభుత్వ భూముల సర్వే నంబర్లలో ఉన్న ప్రైవేట్ భూములను సర్వే చేయించారు.
కలిసికట్టుగా ముందుకు సాగి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మార్కండేయకాలనీలో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు.
రామగుండంలో జరిగిన వాహనాల కొనుగోళ్ల కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ పాలన వ్యవహారాలశాఖ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మసూద్ను ఆదేశించింది. ఈ మేరకు ఆర్డీఎంఏ వరంగల్ మసూద్ సోమవారం రామ గుండం నగరపాలక సంస్థలో విచారణ జరిపారు.
ఆర్టీ సీలో రిటైరైన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని సోమవారం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ కో ఆర్డినేటర్లు రాజేందర్, బాణయ్య మాట్లాడుతూ రిటైర్డ్ అయిన కార్మికులకు ఏళ్ల తరబడి రావా ల్సిన బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తు న్నారని, 35సంవత్సరాలు ఆర్టీసీలో పని చేసిన తమకు రావాల్సిన బకాయిలపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు.
సహకార సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ రైతుల, సంఘాల ఆర్థిక పరిపుష్టి కావాలని కేరళ రాష్ట్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షుడు కే కన్నన్ అన్నారు. కేరళ సహకార సం ఘం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి సోమ వారం సుల్తానాబాద్లోని సహకార సంఘాన్ని సందర్శిం చారు.