Home » Prakasam
‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్వారి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి.
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
ప్రకాశం జిల్లా: మార్కాపురంలోని మీనా మసీదు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్ బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్కు ఆయన లేఖ రాశారు.
తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
Prakasam district hidden treasures: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాలు పెరిగిపోతున్నాయి. పురాతన ఆలయాలు, చారిత్రక నిర్మాణాలే లక్ష్యంగా కొందరు తవ్వకాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొందరు నేరస్థులు అతి తెలివిగా ప్రవర్తించడం చూస్తున్నాం. తాజాగా..
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మూడో రోజూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. భూ ప్రకంపనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతోందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.
ముండ్లమూరు(Mundlamuru)లో మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.