Home » sajjanar
కలర్ ప్రిడిక్షన్.. నంబర్ ప్రిడిక్షన్.. క్రికెట్.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి.. భారతీయులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులకు నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసిందని ఎండీ సజ్జనార్ తెలిపారు.
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట.. బుద్ధుందా అసలు.. అంటూ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. యూట్యూబర్ హర్షసాయిపై మండిప డ్డారు.
యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. గత కొంత కాలంగా యూట్యూబ్కు దూరంగా ఉన్న ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు. గతంలో ఆయన చేసిన ఓ తప్పు.. ఇప్పుడు వెంటాడుతోంది..
TGS RTC MahaLakshmi: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ సిబ్బంది.. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసే ముందు విధి విధానాలు ఖరారు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీజీఎ్సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.
డిజిటల్ అరెస్టుల (Digital Arrest) పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇవాళ (ఆదివారం) ‘మన్ కీ బాత్' 115వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులపై ప్రధాని చేసిన ప్రసంగంపై సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి.
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు అంశం దుమారం రేపుతోంది. ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, రెగ్యులర్ బస్సులకు లేవని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది.