Home » TG Politics
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పావలా చొప్పున నాలుగు సార్లు రైతు రుణ మాఫీ చేసి.. రూ. 8500 కోట్ల మేర రైతులకు ఎగనామం పెట్టారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో రైతులను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ జన్వాడలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కేటీఆర్ ఫామ్ హౌస్ చూసివచ్చినట్లు మంత్రి తెలిపారు.
Telangana: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోటా పోటీగా సమావేశాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (మంగళవారం) సిద్దిపేటలోని మైనంపల్లి అంబేడ్కర్ చౌక్లో మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
జలవనరుల సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా.. దీనిపై మరింత లోతుగా వెళుతోంది. జలవనరులు కనుమరుగవకుండా సంరక్షించాల్సిన అధికారులే అక్రమాలకు...
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పరిగె(పోచారం) శ్రీనివా్సరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు(క్యాబినెట్ హోదా)గా నియమితులయ్యారు.
ఒకపక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు..
తెలంగాణ(Telangana) రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం(Rajiv Gandhi Statue) నిప్పు రాజేస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది.
రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎక్కడికి వస్తారో రండి.. చర్చ పెడదామని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో డేటా తీసుకువస్తామని సవాల్ విసిరారు.
రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని.. రైతు బంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.