Home » Thanneeru Harish Rao
పేదలను, రైతులను సీఎం రేవంత్రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్రావు విమర్శించారు.
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.
ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.
మాజీ మంత్రి హరీష్రావుపై మంత్రి మటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ మాజీ మంత్రి హరీష్రావు సెటైర్లు గుప్పించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తుచేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 1:30గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో పలు కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.
ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నిస్తునే ఉంటానని హరీష్రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోసం, దగా, వంచనకు రేవంత్రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అధికారం కోసం ప్రజలను మోసగించడం రేవంత్ నైజమని హరీష్రావు ఆరోపించారు.