Home » Thanneeru Harish Rao
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు భద్రత లేదని మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కాదు..పోలీసు పాలన సాగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శించారు. సీఎం రేవంత్కు పాలన మీద పట్టు లేదన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్ రాక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కరెంట్ బిల్లులు పెరగలేదని హరీష్రావు చెప్పారు.
కేసీఆర్ పథకాలను కూడా రేవంత్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శించారు. రూ. 15వేల సంగతి అటుంచితే.. ఉన్న రూ. 10 వేల రైతుబంధు కూడా లేకుండా చేసిన ఘనత రేవంత్ సర్కార్ది అని హరీష్రావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్రెడ్డి చరిష్మా తెలుస్తుందని చెప్పారు.
మూసీపై సీఎం రేవంత్ది గోబెల్స్ ప్రచారమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్లను రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు పంచి ఇచ్చి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఅర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చి నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్హౌస్లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
రైతుల భూములను కేసీఆర్, హరీష్రావులు బలవంతంగా లాక్కున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూనిర్వాసితుల సమస్యలపైన హరీష్రావుతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. హరీష్రావు టైం, డేట్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు
హరీష్రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు.
హామీలు అమలు చేసే వరకూ రేవంత్ను వదిలిపెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు.