Share News

Harish Rao: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:57 PM

హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు.

Harish Rao: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

మహబూబాబాద్: వరంగల్ డిక్లరేషన్ అమలు కోసం ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. దసరా తర్వాత ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. రైతుల రుణమాఫీ చేసేవరకూ వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ స్పందించాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకచేతిలో రాజ్యాంగం మరో చేతితో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది రైతు గుండె రేవంత్‌ది రాతిగుండె అని హరీష్‌రావు విమర్శించారు.


సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆగష్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని అన్ని దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసగాడిగా మారారని హరీష్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు మోసగాడు అని విమర్శించారు. 31 కుంటి సాకులు చెప్పి రేవంత్ రుణమాఫీ ఎగ్గొడుతున్నారని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోమని హరీష్‌రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దసరాలోపు రైతుబంధు డబ్బులు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు.


హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని హరీష్‌రావు విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.రేవంత్ రెడ్డి గుండాగిరిచేస్తే బీఆర్ఎస్ నేతలు చూస్తూ ఊరుకోరని హరీష్‌రావు వార్నింగ్ ఇచ్చారు. పాలకుర్తికి ఇద్దరు ఎమ్మెల్యేలట... అయినా అభివృద్ధి జరగడం లేదని హరీష్‌రావు విమర్శించారు.


సీఎం రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్: ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, అబద్దాలకోరు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేశారు. ఇవాళ (శుక్రవారం) తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, మాలోతు కవిత, రుణమాఫీ కానీ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకరరావు మాట్లాడుతూ... సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి అబద్దాలు ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రుణమాఫీ చేసేదాక వదిలిపెట్టామని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.

Updated Date - Oct 04 , 2024 | 02:16 PM