Home » Varla Ramaiah
ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.
గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన అంశం అగ్గిరాజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు అంశంపై కూటమి నేతలు వివరించామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఈవోకు అర్థం కాలేదని తేల్చిచెప్పారు.
ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు.
Andhrapradesh: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు పోలీసుల వ్యవహార శైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ఎంకే మీనాను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన వివరాలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వివరించారు.
Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని..