munugode elections results: సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు... ఈటల

ABN , First Publish Date - 2022-11-06T11:41:46+05:30 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

munugode elections results: సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు... ఈటల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రులు పనిచేసిన స్థానాల్లో టీఆర్‌ఎస్ ఓడిపోయిందన్నారు. కూసుకుంట్ల స్వగ్రామంలో కూడా ఆయన ఓడిపోయారన్నారు. సర్వే సంస్థలకు అందని విధంగా తీర్పు రాబోతోందన్నారు. మునుగోడులో బీజేపీ గెలవబోతుందని ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ముమ్మాటికీ ఓడిపోయేది సీఎం కేసీఆర్ అహంకారమేనన్నారు. పదవులు కాపాడుకోవడానికి మద్యం, డబ్బు పంచారని, వందల కోట్లు ఖర్చు పెట్టకుండా ముఖ్యమంత్రి ఏ ఉప ఎన్నికకూ వెళ్లలేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారని, ఓటర్లకు రాజగోపాల్‌రెడ్డి బంగారం పంచుతారని ఆరోపించడం ధర్మమా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Updated Date - 2022-11-06T11:47:37+05:30 IST