Share News

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

ABN , First Publish Date - 2023-11-24T18:14:00+05:30 IST

రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అమిత్ షా అన్నారు.

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

హైదరాబాద్: రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏడాది కాలంలో రాజేంద్రనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఎ‌న్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎంఐఎం సాయంతోనే ఉగ్రవాదులు తల దాచుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులను కూకటి వేళ్లతో తొలగిస్తాం. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదు. ఎస్సీ వర్గీకరణ 2024 తప్పకుండా చేస్తాం’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-24T18:14:02+05:30 IST