Share News

MLA SUNITA : కూటమి పాలనలో అభివృద్ధి దిశగా పల్లెలు

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:19 AM

కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి జాడ మొదలైందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా రూ.60లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడి వాన కురుస్తున్న స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

MLA SUNITA : కూటమి పాలనలో అభివృద్ధి దిశగా పల్లెలు
MLA listening to problems

చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి జాడ మొదలైందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా రూ.60లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడి వాన కురుస్తున్న స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లా డుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా మన్నారు. నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజల సమస్యల ను అడిగితెలుసుకు న్నారు. ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్‌ సురేశకు మార్‌, పంచాయతీ రాజ్‌ డీఈఈ లక్ష్మీనారాయణ, జేఈఅబ్దుల్‌ఖాదర్‌, ఈఓఆర్‌డీ అశోక్‌నాయక్‌, టీడీపీ నాయకులు ఎల్‌ నారాయణచౌదరి, కన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, పసల పెద్ద వెంకటరాముడు, లడ్డు లక్ష్మయ్య, సందులో వెంకటేశ, పక్కీరప్ప, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ, టీడీపీ పంచాయతీ అధ్యక్షుడు జగదీశ, పాల్గొన్నారు.

నేడు గొందిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

రాప్తాడు: మండలంలోని గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాల్లో గురువా రం నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరవుతారని టీడీపీ మండల కన్వీనర్‌ పంపు కొండప్ప, ప్రధాన కార్యద ర్శి దగ్గుపాటి శ్రీనివాసులు బుధవారం ఓ ప్రటకనలో తెలిపారు. ఉదయం 8:30 గంటలకు గొందిరెడ్డిపల్లికి వస్తాని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 17 , 2024 | 12:19 AM