Share News

Nellore: నెల్లూరు పర్యటనలో గవర్నర్ బిజీ బిజీ

ABN , Publish Date - Mar 13 , 2024 | 07:32 PM

నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుధవారం బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని కస్తూర్బా కళా క్షేత్రంలో పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించారు.

Nellore: నెల్లూరు పర్యటనలో గవర్నర్ బిజీ బిజీ

నెల్లూరు: నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుధవారం బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని కస్తూర్బా కళా క్షేత్రంలో పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించారు. సఫాయి కర్మచారి లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులు, కిట్లు పంపిణీ చేశారు.

వివిధ పథకాల అమలుకి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శించారు. ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో విజయవాడకు తిరుగు పయనం అయ్యారు.

Updated Date - Mar 13 , 2024 | 07:33 PM