ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: స్వరూపా నందేంద్ర హిందూ వత్యిరేకి.. సంచలన ఆరోపణలు చేసిన శ్రీ శ్రీనివాసానంద

ABN, Publish Date - Jun 10 , 2024 | 07:42 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) హిందూ ధర్మాన్ని నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి (Sri Srinivasananda Saraswati) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, శ్రీ శారదా పీఠం స్వరూపా నందేంద్ర సరస్వతిపై సంచలన ఆరోపణలు చేశారు.

Sri Srinivasananda Saraswati

విశాఖపట్నం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) హిందూ ధర్మాన్ని నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి (Sri Srinivasananda Saraswati) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, శ్రీ శారదా పీఠం స్వరూపా నందేంద్ర సరస్వతిపై సంచలన ఆరోపణలు చేశారు.

విశాఖపట్నంలో ఈరోజు(సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ... నందేంద్ర సరస్వతి..హిందూద్రోహి..భూకబ్జాదారుడు..ఆయన బ్లాక్ మెయిలర్ అని విమర్శలు చేశారు. విశాఖలో సెటిల్మెంట్ చేసుకుంటూ....రాజకీయ పీఠంగా మార్చారని మండిపడ్డారు. ఆయన లాంటి వారు కాషాయం కట్టుకున్నందుకు సిగ్గు పడాలని ఆక్షేపించారు. స్వరూపానందేంద్ర హిందూ ధర్మం కోసం సేవ చేస్తున్నామని చెప్పి భూములు కొట్టేశారని విమర్శలు చేశారు.


ఆలయాల్లో పవిత్రనును నాశనం చేశారు..

‘‘రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అన్నారు..ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? జగన్ హయాంలో తిరుపతితో సహా అన్ని ఆలయాల్లో పవిత్రనును నాశనం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు..? జగన్ ..శాస్త్ర విరుద్ధంగా భార్య లేకుండా తిరుపతికి వెళ్లినప్పుడు ఎందుకు స్పందించలేదు..? కాషాయం అంటే చీదరించుకునే విధంగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో దేవాలయాలు మీద, విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు..? స్వామిజీని చంపినప్పుడు, హిందువులను వేధించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు..? రామతీర్థం రాముడి శిరస్సు ఖండించి నప్పుడు ఎందుకు నోరు విప్పలేదు? చూడటానికైనా మీరు వచ్చారా..? ఇపుడు శ్రీ రంగ నీతులు చెబుతారా? జగన్ హిందూ ధర్మాన్ని నాశనం చేసినప్పుడు ..మీరంతా ఏమయ్యారు..? జగన్‌కి అమ్ముడు పోయారా...ఇప్పుడు కూని రాగాలు కూస్తారా..?కరోనా సమయంలో రాష్ట్రంలో వినాయక మండపాలు తీసేస్తే...అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సరూపానంద మాటలు ఎవరూ నమ్మరు.. జగన్ హయాంలో.. మేము వాస్తవాలు మాట్లాడితే దాడులు చేశారు’’ అని శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు.


హిందూ సమాజం క్షమించదు..

‘‘సిగ్గు తెచ్చుకొని...ఆత్మ పరిశీలన చేసుకో...హిందూ సమాజం నిన్ను క్షమించదు. రామతీర్థం కొండకు టీడీపీ అధినేత చంద్ర బాబు వచ్చినప్పుడు..ఎందుకు మాట్లాడలేదు. సింహచలం భూములు ఆక్రమణకు గురైతే ఒక ముక్క ఎందుకు మాట్లాడలేదు..? మీ పీఠం ధర్మం కోసం ఉందా..ధనం కోసమా..? లోకం బాగుండాలని ఎప్పుడైనా యాగం చేశారా..?..వైసీపీ కోసం మాత్రమే యాగం చేశారు కదా..? శారదా పీఠం వ్యవహారాలపై సీఐడీ, సీబీఐ విచారణ జరిపించాలి. అప్పుడే స్వామిజీ దురాగతాలు బయట పడతాయి. ఎవరికి భయపడనప్పుడు ఇప్పుడు ఈ రోజు(సోమవారం) ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు..? శారదా పీఠం నామకరణం ఎప్పుడూ జరిగిందో చెప్పాలి.శ్రీ శారదా పీఠానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని శ్రీ శ్రీనివాసానంద సరస్వతి విన్నవించారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 07:50 PM

Advertising
Advertising