ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

America TDP Fans: అమెరికాలో టీడీపీ అభిమానుల సంబురాలు

ABN, Publish Date - Jun 17 , 2024 | 10:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడంతో అమెరికాలో సంబురాలు అంబురాన్నంటాయి.

  • 250 కార్లతో ర్యాలీ.. కాలిఫోర్నియాలోని ఫ్రీమోంట్‌లో వేడుకలు

  • ఇది చారిత్రాత్మక విజయమంటూ వీడియో సందేశమిచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

హైదరాబాద్, జూన్17( ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడంతో అమెరికాలో సంబురాలు అంబురాన్నంటాయి. కాలిఫోర్నియాలోని (California) టీడీపీ అభిమానులు కూటమి విజయం సాధించడం పట్ల పెద్ద ఎత్తున సంబురాలు చేశారు. మొదటగా కాలిఫోర్నియా ఫ్రీమోంట్‌లోని హాప్కిన్స్ స్కూల్ నుంచి సెంట్రల్ పార్కు వరకు 250కి పైగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేవారు. ఈ కార్యక్రమంలో దాదాపు900 మందికి పైగా పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, దక్షత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీడియో సందేశమిచ్చారు. ఏపీలో కూటమిది చారిత్రాత్మక విజయమని అన్నారు.


ఇంతటి విజయాన్ని అందించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలతో పాటు మద్దతిచ్చిన ఎన్నారైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ఎన్నారైలు కొన్ని నెలల పాటు ఉద్యోగాలు, కుటుంబాలను వదిలి రాష్ట్రంలోనే ఉంటూ కూటమి విజయం కోసం కృషి చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ అధ్యక్షులు కోమటి జయరాం ఆధ్వర్యంలో నిర్వహించారు.


Updated Date - Jun 17 , 2024 | 10:42 PM

Advertising
Advertising