Share News

బాస్కెట్‌బాల్‌లో యూఎస్‌ ‘డబుల్‌’

ABN , Publish Date - Aug 12 , 2024 | 02:35 AM

బాస్కెట్‌బాల్‌ ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా పురుషుల జట్టు.. వరుసగా ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు యూఎస్‌ మహిళల జట్టు కూడా పసిడిని దక్కించుకొంది...

బాస్కెట్‌బాల్‌లో యూఎస్‌ ‘డబుల్‌’

పారిస్‌: బాస్కెట్‌బాల్‌ ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా పురుషుల జట్టు.. వరుసగా ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు యూఎస్‌ మహిళల జట్టు కూడా పసిడిని దక్కించుకొంది. ఎన్‌బీఏ స్టార్‌ స్టీఫెన్‌ కర్రీ 24 పాయింట్లతో విజృంభించడంతో.. ఫైనల్లో అమెరికా 98-87తో ఫ్రాన్స్‌ను ఓడించింది. కాంస్య పోరులో సెర్బియా 93-83తో జర్మనీపై నెగ్గింది. హోరాహోరీగా సాగిన మహిళల తుది పోరులో అమెరికా 67-66తో ఫ్రాన్స్‌పై గెలిచింది. బెల్జియాన్ని 85-81తో ఓడించిన ఆస్ట్రేలియా కాంస్యం దక్కించుకొంది.

Updated Date - Aug 12 , 2024 | 02:35 AM