ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

ABN, Publish Date - Aug 05 , 2024 | 05:30 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

  • ఒకరికి తీవ్ర గాయాలు

  • శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం

దోమలపెంట, ఆగస్టు 4: నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారానికి చెందిన మాచర్ల కిషన్‌(21), మేడ్చల్‌ జిల్లా కొంపల్లికి చెందిన సాయిప్రకాశ్‌(28), వికారాబాద్‌ జిల్లా అల్లికానిపల్లికి చెందిన రమేశ్‌(22), మెదక్‌ జిల్లా పిల్లవాడ గ్రామానికి చెందిన గణేశ్‌ హైదరాబాద్‌లోని శ్రీ జయరాం ఆటోమెటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్‌ మెకానిక్‌లుగా పని చేస్తున్నారు.


వీరందరూ కలిసి శనివారం రాత్రి కారులో శ్రీశైలానికి బయల్దేరివెళ్లారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో వారి కారు దోమలపెంట-వటువర్లపల్లి గ్రామాల మధ్య, రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్నది. ప్రమాదంలో కిషన్‌, సాయి ప్రకాష్‌, రమేశ్‌ అక్కడికక్కడే చనిపోయారు. గణేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో ఈ నలుగురూ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Aug 05 , 2024 | 05:30 AM

Advertising
Advertising
<