Share News

Yadagirigutta: వీఐపీకి గంట, ధర్మదర్శనానికి 3 గంటలు..

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:14 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట,

Yadagirigutta: వీఐపీకి గంట, ధర్మదర్శనానికి 3 గంటలు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు చెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ తిరువీధులు, క్యూలైన్లు, పరిసర ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.45,08,650 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

- భువనగిరి అర్బన్‌

Updated Date - Jul 01 , 2024 | 04:14 AM