ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

ABN, Publish Date - Sep 28 , 2024 | 03:35 PM

తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Chamala Kiran Kumar Reddy

ఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. లడ్డూ కల్తీ జరగడం వల్ల తిరుమలకు నష్టం జరిగిందని అన్నారు. ఈ విషయం తెలిసిన దగ్గరి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను కాపాడటానికి సీఎం‌ రేవంత్‌రెడ్డి తన మాటలను ఆచరణలో పెట్టారని అన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు హైడ్రా కార్యక్రమాలను తప్పు పట్టడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో హైడ్రా గురించి మాట్లాడారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.


ALSO READ: Harish Rao: కన్నీరు పెట్టుకున్న హరీశ్ రావు.. ఇంతకీ ఏమైందంటే..

కేసీఆర్ గతంలో తెలంగాణలో అక్రమ కట్టడాలు కూల్చాలని చెప్పారని అన్నారు. హైదరాబాద్‌లో28 వేల నాలాలపై ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. అక్రమ నిర్మాణాలను కూల్చేటప్పుడు ప్రభుత్వానికి మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత లేక్ సిటీగా ఉన్న నగరాన్ని అదే స్థానంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది భారీ వర్షాలతో హైదరాబాద్ వరదల్లో మునిగిపోతుందని చెప్పారు. హైడ్రా మన భవిష్యత్తు అని తెలిపారు. భావితరాలు హైదరాబాద్‌లో నివసించాలని చెప్పారు. వరదలతో హైదరాబాద్ నష్టపోవద్దని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. హైడ్రాతో ప్రజలు నష్టపోవద్దని గతంలో హరీష్‌రావు అన్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు.


ALSO READ: MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..

హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడుతున్నారని.. గతంలో కేసీఆర్ అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలని అన్నారని చెప్పారు. దీనికి హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బాధితులను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో జరగుతున్న విపత్తుల గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉండొచ్చు కానీ తర్వాత ఏదో ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పటికి కూడా హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.


ALSO READ: TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళనను తీసుకువచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చైర్మన్‌ను చేశారని అన్నారు. మూసీ పరిసరా ప్రాంతాల్లోని పేదలకు 15 వేల ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పిల్లలను పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ప్రజలకు న్యాయం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుందని అన్నారు. పురాతన కట్టడాలను సీఎం రేవంత్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై 24 గంటలు సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Bandi Sanjay: హైడ్రా తీరుపై స్వయంగా పాట పాడిన బండి సంజయ్

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 03:50 PM