Share News

KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:43 PM

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. డబ్బుల కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని విమర్శించారు.

 KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి
KTR

జగిత్యాల: రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. డబ్బుల కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని విమర్శించారు. కాంగ్రెస్‌లో(Congress) చేరడం అంటే. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటికి రావాలని సవాల్ విసిరారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) దమ్ముంటే పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.


సంజయ్ కుమార్ ఇక క్రషర్ కాడ కూర్చుని కంకర ఏరుకుంటూ ఉండాలని సెటైర్లు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డి ఇవ్వనీయడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా 2లక్షల రుణమాఫీని ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత త్వరలోనే వస్తుందని.. గల్లి గల్లి తిరుగుతుందని కేటీఆర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి....

AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి హైకోర్టు మెట్లు ఎక్కాడు

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 05:19 PM