ప్రజలు ఛీ కొట్టిన వాళ్ల బుద్ధి మారలేదు...

ABN, Publish Date - Jul 29 , 2024 | 08:59 AM

మహబూబ్‌నగర్ జిల్లా: తెలంగాణలో పేదలకు కష్టాలు రాలేదని, ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే కష్టాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన బాధ కేసీఆర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజలు ఛీ కొట్టినా.. కేసీఆర్, కేటీఆర్ బుద్ధి మారలేదని సీఎం మండిపడ్డారు.

మహబూబ్‌నగర్ జిల్లా: తెలంగాణలో పేదలకు కష్టాలు రాలేదని, ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే కష్టాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన బాధ కేసీఆర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజలు ఛీ కొట్టినా.. కేసీఆర్, కేటీఆర్ బుద్ధి మారలేదని సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో నాయకుల ఎన్నికలు అయిపోయాయని.. వచ్చేవి కార్యకర్తల ఎన్నికలని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఊరు తిరిగి తమ కార్యకర్తలను గెలిపించుకుంటామన్నారు. నాయకుల ఎన్నికలు అయిపోతే.. నాయకులు కార్యకర్తలను మరిచిపోతారని.. కానీ తాను నాయకుడిని కాదని.. కార్యకర్తల్లో కార్యకర్తనని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను ప్రజాప్రతినిధులగా గెలిపించి సంక్షేమం, అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వామ్యం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ మేయర్ సీటుపై ఎన్డీయే కన్ను...!

వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...

సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 29 , 2024 | 08:59 AM