Share News

TDP : ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:57 AM

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

TDP : ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
MP Ambika and Venkatasivadu Yadav honoring senior leaders

అనంతపురం అర్బన, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, రాష్ట్ర నాయకులు ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ, జేఎల్‌ మురళి, గాజుల ఆదెన్న, ముంటిమడుగు కేశవరెడ్డి, గౌస్‌మొద్దీన, దండు శ్రీనివాసులు, బుగ్గయ్య చౌదరి, స్వరూప, పోతులయ్య, విశాలాక్షి, స్వామిదాస్‌, కూచి హరి, సిమెంట్‌ పోలన్న, కుంచెపు వెంకటేష్‌, సుధాకర్‌ యాదవ్‌, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.


ఎంపీ క్యాంప్‌ కార్యాలయం వద్ద : నగర శివారులోని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ క్యాంప్‌ కార్యాలయంలో ఎంపీ అంబికా, టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో ఎనీ ్టఆర్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బీసీ సెల్‌ నా యకులు సిమెంట్‌ పోలన్న, కుంచెపు వెంకటేష్‌, పుల్లన్న, లక్ష్మన్న, సుధాకర్‌, భాస్కర్‌, తాతయ్య, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పోరేటర్‌ రాజారావు ఆధ్వర్యంలో స్థానిక 35,36వ డివిజన్లల్లో పార్టీ జెండాను ఆవిష్క రించారు. రాంనగర్‌లోని వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. స్థానిక ఐదో డివిజనలో మాజీ కార్పొరేటర్‌ సరళ ఆధ్వర్యంలో, ఆరో రోడ్డులో టీడీపీ నాయకులు ఓంకార్‌రెడ్డి, 18వ డివిజనలో సైఫుద్దీన, జేఎం బాషా, 39 వ చేపల హరి, రెవెన్యూ కాలనీలో కల్పనా రాణి, అశోక్‌ నగర్‌లో వెంకటరామ య్య ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 30 , 2025 | 12:57 AM