Share News

వైభవంగా శ్రీపుష్పోత్సవం

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:05 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా శ్రీపుష్పోత్సవం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు, తులసిపూజ, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆయా ఏర్పాట్లు నిర్వహించారు. వారం రోజులపాటు నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి.

Updated Date - Apr 14 , 2025 | 01:05 AM