వాడపల్లి వెంకన్న ఒక్కరోజు ఆదాయం రూ.4.79లక్షలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:53 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.

ఆత్రేయపురం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. ఏడ వారాల నోము ఆచరించిన భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు నిర్వహించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.4,79,286 వచ్చినట్టు ఉపకమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి రావులపాలానికి చెందిన ఎస్వీ ఈవెంట్స్ అధినేత కొవ్వూరి ధర్మారెడ్డి, ఇందిర దంపతులు రూ.1,11,116 విరాళం ఇచ్చారు. దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఈవో అందచేశారు.