Share News

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.59లక్షలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:35 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.59లక్షలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తజనం అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొ న్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.2,59,462 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావుతెలి పారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి విశాఖ జిల్లా గాజువాకకు చెందిన నూక వెంకట గణేశ్వరరావు, జ్యోతి గణేష్‌కుమార్‌ కుటుంబ సభ్యులు రూ.50,117 విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం అందచేశారు.

Updated Date - Apr 16 , 2025 | 01:36 AM