Share News

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:21 AM

అమరావతి: తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు.

 CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
CM Chandrababu Naidu

అమరావతి: తెలుగువారందరూ (Telugu People) నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆ మహనీయుని జయంతి (Jayanthi) సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు.


మంత్రి లోకేష్ నివాళి..

ఆంధ్ర రాష్ట్ర (Andhra Pradesh) సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష (Hunger strike) చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) జయంతి (Birth Anniversary) సందర్భంగా ఆ మహనీయునికి ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ఘన నివాళి (Tribute) అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన కృషితేనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషిచేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదామని మంత్రి లోకేష్ అన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 10:23 AM