Nara lokesh: మహాకుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:20 PM
Nara lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు. సతీమణి బ్రాహ్మిణితో కలిసి లోకేష్ .. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు.

అమరావతి, ఫిబ్రవరి 17: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాని మోదీ నుంచి వీఐపీలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది పుణ్యస్నానాలు చేశారు. తాజాగా ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara lokesh) దంపతులు కూడా మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు లోకేష్ దంపతులు. ఆపై పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.
పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు.
ఢిల్లీలో భూకంపానికి ముందు భారీ శబ్ధం.. కారణమదేనా..
కాగా.. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివెళ్తున్నారు. కోట్లలో భక్తులు త్రివేణీ సంగమంలో స్నాణాలు ఆచరిస్తున్నారు. జనవరి 13l మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి గత శుక్రవారం వరకు త్రివేణి సంగమంలో స్నానమాచరించిన భక్తుల వివరాలను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. రికార్డు స్థాయిలో ఏకంగా 50 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారని ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్రగా యూపీ సర్కార్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు
Read Latest AP News And Telugu News