కార్యదర్శులపై పనిభారం తగ్గించండి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:13 AM
: తమపై పనిభారం తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు.ఈ మేరకు బుధవారం బూర్జ ఎంపీడీవోకు జిల్లా పంచా యతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మెట్ట అమరనాధ్, బూర్జ మండల పంచా యతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు కరణం మురళీమోహన్రావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

బూర్జ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): తమపై పనిభారం తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు.ఈ మేరకు బుధవారం బూర్జ ఎంపీడీవోకు జిల్లా పంచా యతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మెట్ట అమరనాధ్, బూర్జ మండల పంచా యతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు కరణం మురళీమోహన్రావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఫకవిటి, మార్చి12(ఆంధ్రజ్యోతి): పనిభారం తగ్గించాలని కవిటి మండల పంచాయతీ కార్యదర్శులు కోరారు.కవిటి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు.అలాగే జగతి పంచాయతీలోని తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరుచేయాలని సర్పంచ్ పి.వర ప్రసాద్, ఉపసర్పంచ్ బూషరాజు, గ్రామస్థులు కె.లచ్చయ్య,ఎ.అప్పన్న కోరారు. ఈ మేరకు శ్రీకాకుళంలో డీపీవో భారతిసౌజన్యకు వినతిపత్రం అందజేశారు.