సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:19 AM
ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర చేసినట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.

- ఎమ్మెల్యే గొండు శంకర్
గార, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర చేసినట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం బందరు వానిపేటలో ఆయన పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని, వీధుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో మురుగునీరు, విద్యుత్తు సమస్యలు, తాగునీరు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ బందరు వానిపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.82లక్షల నిధులు మంజూరు చేశారు. కార్యక్రమంలో మండల అధికా రులు, నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.