నేడు మంత్రి నారా లోకేశ్ రాక
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:35 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం నగరానికి రానున్నారు.

విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియానికి వెళ్లి ఐపీఎల్ మ్యాచ్ తిలకిస్తారు. మ్యాచ్ ముగిసిన అనంతరం రాత్రి 7.40 గంటలకు టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ బస చేస్తారు. ఈనెల 31వ తేదీ ఉదయం బీచ్ రోడ్డులో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గానికి వెళతారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.