Share News

YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:00 AM

పిచ్చమ్మ అంత్యక్రియలు మంగళవారం వారి స్వగ్రామమైన మేదరమెట్లలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

 YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

నేడు అంత్యక్రియలకు హెలికాప్టర్‌లో జగన్‌

మేదరమెట్ల, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఒంగోలులోని స్వగృహంలో మృతిచెందారు. పిచ్చమ్మ అంత్యక్రియలు మంగళవారం వారి స్వగ్రామమైన మేదరమెట్లలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అలాగే వైఎస్‌ విజయమ్మ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా హాజరవుతారని బంధువులు తెలిపారు. మేదరమెట్లలో హెలిప్యాడ్‌ నిర్మాణానికి అనువైన స్థలం కోసం వైసీపీ నాయకులు పరిశీలన చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 05:00 AM