India-US Relations: అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం: జైశంకర్
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:30 AM
ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతీకారంగా స్పందించకుండా చర్చల మార్గం ఎంచుకున్నట్టు జైశంకర్ వెల్లడించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంప్రదింపులు జరపాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారి్ఫలపై ప్రతీకార సుంకాలు విధించాలని పలు దేశాలు భావిస్తుండగా, భారత్ మాత్రం చర్చల మార్గాన్ని ఎంచుకొంది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోనులో చర్చలు జరిపారు. ఇరు దేశాలు త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. దీనిపై మరిన్ని సంప్రదింపులు జరపాలని ప్రతిపాదించారు. ప్రధాని మోదీ జరిపిన అమెరికా పర్యటనలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు