Hyderabad: ఆ జింకకు పెద్ద కష్టమే వచ్చిందిగా..
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:36 AM
ఆ జింకకు పెద్ద కష్టమే వచ్చింది. అడవిలో హాయిగా గెంతులు వేయాల్సిన ఆ జింక జనారణ్యంలోకి వచ్చింది. గతకొద్ది రోజులుగా హెచ్సీయూ క్యాంపస్ వివిధ ఆందోళనలతో అట్టుడుకి పోతున్న సంగతి తెలిసిందే. దీంతో సమీపంలో ఉండే వన్యప్రాణులు బెదిరిపోయి పక్కనే ఉన్న ఇళ్లలోకి వస్తున్నాయి.

హైదరాబాద్: ఎంత కష్యం వచ్చిందో ఏమో తెలియదు కానీ, హాయిగా అడవుల్లో ఉండాల్సిన వణ్యప్రాణులు జనావాసాల మధ్య ఇళ్లలోకి వస్తున్నాయి. శుక్రవారం ఓ జింక హెచ్సీయూ క్యాంపస్(HCU Campus) అడవిలో నుంచి గోపన్పల్లి ఎన్టీఆర్నగర్లోని ఓ ఇంట్లోకి వచ్చింది. జింకను గుర్తించిన ఇంటి యజమానురాలు కమల రాజేంద్రనగర్(Tajendranagar) అటవీ అధికారులు, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం అధికారులు వచ్చి జింకను తీసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: MIM, BJP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
Read Latest Telangana News and National News