Share News

Layout Regularization Scheme: ఎల్‌ఆర్‌ఎ్‌సలో ఈ నెల కూడా 25శాతం రాయితీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:26 AM

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకంలో 25% రాయితీని ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తితో గడువు పెంచి, బుధవారం దీనిపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది.

Layout Regularization Scheme: ఎల్‌ఆర్‌ఎ్‌సలో ఈ నెల కూడా 25శాతం రాయితీ

గడువు పొడిగింపుపై నేడు ఉత్తర్వులు!

ఏప్రిల్‌ 1న ఫీజు చెల్లించిన వారికీ రాయితీ ఇచ్చిన అధికారులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో 25 శాతం రాయితీని ఈ నెల కూడా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. గత నెల 25 శాతం రాయితీని ప్రకటించిన ప్రభుత్వం.. 31వ తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తితో ఈ గడువును మరో నెల రోజులు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు రానున్నాయని పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మార్చి 31న 43,700 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఆ ఒక్క రోజే ఫీజు కింద రూ.124 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 4,43,000 మంది ఫీజు చెల్లించారు. అధికారులు మంగళవారం (ఏప్రిల్‌ 1న) కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని వర్తింపజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 02:26 AM