2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:24 PM
ఈ ఏడాది ఫిబ్రవరి 15న నియామక పత్రాలు అందుకున్న 2008 డీఎస్సీ ఎస్జీటీ ఉపా ధ్యాయులకు వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యం లో మంగళవారం జిల్లా విద్యా ధికారి రమేష్కుమార్కు వినతిపత్రం అందజేశా రు.

- ఎస్టీయూ ఆధ్వర్యంలో డీఈవోకు వినతి
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఫిబ్రవరి 15న నియామక పత్రాలు అందుకున్న 2008 డీఎస్సీ ఎస్జీటీ ఉపా ధ్యాయులకు వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యం లో మంగళవారం జిల్లా విద్యా ధికారి రమేష్కుమార్కు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.మురళి మాట్లాడుతూ నియామక పత్రాలు అందుకుని జిల్లాలో పలు పాఠశాలలో చేరి పని చేస్తున్న 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నేటికి జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారంతా ఇ బ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి వారి జీతాలు అందజే యాలని ఆయన కోరారు. ఎస్టీయూ రాష్ట్ర కా ర్యదర్శి కె.రమేష్, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు నరేష్, రాజశేఖర్, బాలస్వామి, మహేష్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.