Share News

2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:24 PM

ఈ ఏడాది ఫిబ్రవరి 15న నియామక పత్రాలు అందుకున్న 2008 డీఎస్సీ ఎస్‌జీటీ ఉపా ధ్యాయులకు వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యం లో మంగళవారం జిల్లా విద్యా ధికారి రమేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశా రు.

 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి
జిల్లా కేంద్రంలో డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్టీయూ నాయకులు, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు

- ఎస్టీయూ ఆధ్వర్యంలో డీఈవోకు వినతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఫిబ్రవరి 15న నియామక పత్రాలు అందుకున్న 2008 డీఎస్సీ ఎస్‌జీటీ ఉపా ధ్యాయులకు వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యం లో మంగళవారం జిల్లా విద్యా ధికారి రమేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మురళి మాట్లాడుతూ నియామక పత్రాలు అందుకుని జిల్లాలో పలు పాఠశాలలో చేరి పని చేస్తున్న 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నేటికి జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారంతా ఇ బ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి వారి జీతాలు అందజే యాలని ఆయన కోరారు. ఎస్టీయూ రాష్ట్ర కా ర్యదర్శి కె.రమేష్‌, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు నరేష్‌, రాజశేఖర్‌, బాలస్వామి, మహేష్‌, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:24 PM