జగన్కు సీఎం చంద్రబాబు కౌంటర్
ABN, Publish Date - Feb 09 , 2025 | 08:27 AM
సంక్షేమం పేరిట బటన్ నొక్కి ప్రజలను మోసం చేశారని, దీనిపై ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా దుమ్మెత్తి పోయడం, వ్యక్తిగత దూషణలు చేయడం, అరెస్టులు చేయడం, గర్వంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం చేశారని సీఎం చంద్రబాబు జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయ కాలుష్యాన్ని ప్రజలు ఎక్కువ కాలం భరించలేక ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు.

అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షడు (YSRCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) 2.0తో వస్తాన్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కౌంటర్ (Counter) ఇచ్చారు. సభలో సీఎంకు ఇచ్చే సమయం తనకు ఇస్తేనే అసెంబ్లీకి వస్తాన్న జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ప్రజలకు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని.. అలాంటిది తానెలా ఇస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటి వితండ వాదనకు ఎవరూ సమాధానం చెప్పలేరన్నారు. గర్వంతో మాట్లాడే వ్యక్తులతో రాజకీయాలు చేయాలంటే బాధేస్తోందన్నారు. మనం విలువలు పాటించకుండా విలువల గురించి చెప్పడం హాస్యాస్పదమని సీఎం చంద్రబాబు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
శ్రవారిని దర్శించుకున్న శ్రద్ధా శ్రీనాథ్
ఈ వార్తలు కూడా చదవండి..
భార్యను చంపింది గురుమూర్తి ఒక్కడే కాదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 09 , 2025 | 08:27 AM