చిత్రాడకు పోటెత్తిన జన సైనికులు..

ABN, Publish Date - Mar 14 , 2025 | 05:39 PM

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ సభ దద్దరిల్లిపోతోంది. లక్షల మంది జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున చిత్రాడ సభ వద్దకు చేరుకున్నారు.

The video is not available or it's processing - Please check back later.

కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ సభ దద్దరిల్లిపోతోంది. లక్షల మంది జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున చిత్రాడ సభ వద్దకు చేరుకున్నారు. ఒక్కో గ్యాలరీలో 2,500 మంది కూర్చొనేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే గ్యాలరీలన్నీ నిండిపోయాయి. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున సభా స్థలం వద్దకు చేరుకున్నారు. మరోవైపు సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. పిఠాపురం పరిసర ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా వారికి అన్నదాన కేంద్రాలు సిద్ధం చేశారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్యలో చిత్రాడకు పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

Chandrababu lokesh Wishes: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌కు సీఎం, లోకేష్ శుభాకాంక్షలు

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Updated at - Mar 14 , 2025 | 05:42 PM