Home » Amaravati
సూళ్లూరుపేటలో ఓవ్యక్తి అర్ధరాత్రి మారణాయుధాలతో హల్చల్ చేసిన సంఘటన ఇది. పక్కింట్లో ఉంటున్న దంపతులపై దాడికి ప్రయత్నించగా వారు తప్పించుకుని పారిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చే. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోరంట్ల మాధవ్పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గోరంట్లకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో 17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు ఖరారు అయ్యాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ.31,167 కోట్ల పెట్టుబడులు రానుండగా, దాదాపు 32,633 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్.. ఆ మాటలేంటి.. అంటూ వ్యాఖ్యానించారు. పోలీసులను బట్టలూడదీసి కొడతానని అనడంపై ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా అంటూ ప్రశ్నించారు.
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
వక్ఫ్ భూములను వాణిజ్య అవసరాలకు కట్టబెట్టే ప్రయత్నాలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ముస్లిం సంక్షేమం కోసమే వక్ఫ్ భూములు ఉపయోగించాలని స్పష్టంగా ఆదేశించారు