Home » Arvind Kejriwal
దేశరాజధానిలో మురికికూపంగా మారిన పలు ప్రాంతాలను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'ఇదీ కేజ్రీవాల్ మెరిసిపోతున్న ఢిల్లీ - పారిస్ వాలీ ఢిల్లీ' అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఢిల్లీ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవద్దని కేజ్రీవాల్ కోరారు. ఆప్ నేతలు ఎవరైనా డబ్బులు పంచినా సరే వారికి ఓటు వేయవద్దని సూచించారు. గెలుపు, ఓటముల కోసం తాము ఎన్నికల బరిలోకి రాలేదని, దేశంలో మార్పులు తెచ్చేందుకే తాము ఇక్కడ ఉ్ననామని చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో మురికివాడలన్నింటినీ కూల్చేసి, వేలాది మంది కుటుంబాలను నిరాశ్రయులను చేయాలన్నదే బీజేపీ ఆలోచన అని కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడలు కూల్చకుండా అడ్డుకున్న క్రెడిట్ తమ (ఆప్) ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల్లో వరుసా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది. అయితే ఆప్ పాలనకు గండి కొట్టి.. అధికార పీఠాన్ని అందుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.
ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు.