Home » Chandra Babu Arrest
చంద్రబాబు(Chandrababu)ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న వీడియోలు ఏఏ విధంగా బయటకు వచ్చాయని తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్(Yarapatineni Srinivas) ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ పాలిటిక్స్లో కీలక పరిణామంగా నిలిచింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును A-1గా సీఐడీ పేర్కొంది. నంద్యాలలోని RK ఫంక్షన్ హాల్ దగ్గర చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
హెడ్డింగ్ చూడగానే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్కు (Chandrababu Arrest) .. ప్రతిష్టాత్మకంగా భారత్లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు (G-20 Summit) ఏమిటి సంబంధం అనే సందేహాలు కలుగుతున్నాయ్ కదా. అవును మీరు వింటున్నది నిజమే.. సంబంధం ఉంది.!..
చంద్రబాబును ఆయన కాన్వాయ్లోనే నంద్యాల నుంచి విజయవాడకు పోలీసులు తీసుకువెళ్తున్న వీడియోలను కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆయన్ని దేవుడి జాతరలో ఊరేగించినట్టు ఊరేగుస్తున్నారు.. ఆయన సత్తా ఏంటో ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానం ఏంటో ప్రపంచం మొత్తం చూసేలా చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్పై(Skill Development Project) మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితానీ సత్యనారాయణ(Pitani Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను అక్రమ అరెస్ట్ను పితానీ ఖండించారు.
విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దంటూ గన్నవరం విమానాశ్రయం అధికారులను ఏపీ పోలీసులు కోరారు.
చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన తీరు బాధాకరమని గల్లా గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు.
వైసీపీ ప్రభుత్వం(YCP Govt) కక్షపూరితంగా నేడు చంద్రబాబును అరెస్ట్(Chandrababu arrested) చేయడం భారతదేశ చరిత్రలో చీకటి రోజు, దుర్ధినమని టీడీపీ ఎంపీ కేశినేని నాని(TDP MP Keshineni Nani) అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై 465,468, 471, 409, 201, 166, 167, 418, 420 సెక్షన్ల కింద సీబీఐ(cbi) కేసులు నమోదు చేసింది.
టీడీపీ ప్రభుత్వం 2015లో స్కిల్ డెవల్పమెంట్- సీమెన్స్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు వ్యయం 3,356 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం. మిగిలిన 90 శాతం సీమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ భరించేలా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. 2020 డిసెంబరులో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నిజనిజాలను నిగ్గు తేల్చకుండా చంద్రబాబును దోషిగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విచారణ సాగాలని జగన్ సర్కారు నిర్ణయించింది.