Home » Cheater
ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది.
హైదరాబాద్: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే కేటు గాళ్ళు టోకరా వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేశారు.
వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.
స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(Dhoni) కూడా కోట్ల రూపాయలు మోసపోయారు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఇద్దరు రూ.15 కోట్ల మేర తనను మోసం చేశారని ధోనీ ఏకంగా కోర్టులో కేసు వేశారు.