Share News

AP News: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే టోకరా

ABN , Publish Date - Feb 28 , 2024 | 08:48 AM

హైదరాబాద్: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే కేటు గాళ్ళు టోకరా వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేశారు.

AP News: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే టోకరా

హైదరాబాద్: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే కేటుగాళ్ళు టోకరా వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీఎస్‌ఆర్ వర్మ కుటుంబం వద్ద నుంచి నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే వ్యక్తులు రూ. రెండున్నర కోట్లు వసూలు చేశారు.

రెండేళ్లు గడిచినా బాండ్లకు సంబంధించి కేటు గాళ్ళు రశీదులు ఇవ్వలేదు. ఈ క్రమంలో బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీం కోర్టులో తీర్పు వచ్చింది. దీంతో అప్రమత్తమైన రిటైర్డు జస్టిస్ డీఎస్‌ఆర్ వర్మ రూ. రెండున్నర కోట్ల గురించి వాకబు చేశారు. కేటుగాళ్లు సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని తెలియడంతో ఆయన ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 406, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Feb 28 , 2024 | 08:48 AM