Home » Delhi Airport
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
బస్సుల్లో.. బస్టాండుల్లో, రైళ్లలో.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జేబులను చోరి చేయడం సహజంగా వింటుంటాం.. చూస్తుంటాం. కానీ విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకొని వారి విలువైన ఆభరణాలను చాకచక్యంగా కొట్టేస్తున్న ఓ చోర శిఖామణి ఆటను ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు కట్టించారు.
ఢిల్లీ ఎయిర్పోర్టులోని పాస్పోర్టు ఆఫీసర్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని ఓ రష్యా యువతి ఆరోపించింది. తన టిక్కెట్పై అతడి ఫోన్ నెంబర్ రాసిచ్చి కాల్ చేయమన్నాడని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది.
ప్రపంచంలో రద్దీగా ఉండే పది విమానాశ్రయాల జాబితాను ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. అందులో దేశ రాజధాని ఢిల్లీలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు లభించింది.
ఢిల్లీని పొగమంచు(Fog) వణికిస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
నిన్నటి వరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం చలి వణికిస్తోంది. చలి గుప్పిట్లో చిక్కుకుని దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తీవ్ర చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు.
విమానం ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్(Delhi Airport)లో సిబ్బందితో గొడవకు దిగారు ప్రయాణికులు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకుని ఆసుపత్రులపాలవ్వడం ఢిల్లీ వాసులకు సాధారణమైపోయింది.