Home » Dharma Reddy
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాలనాపరమైన, కీలకమైన అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావుని ప్రభుత్వం నియమించింది.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.
ఒకరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరూ ‘హద్దులు’ మీరారంటూ విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. వీటిని సీరియస్గా తీసుకున్న ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది...