Home » Gannavaram
దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో చలి అధికమైంది. ఈ నేపథ్యంలో గన్నవరంలో భారీగా పొగమంచు కురుస్తోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గన్నవరం హైవేను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు సర్వీసులు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమాన సర్వీసులను యాజమాన్యాలు రద్దు చేశాయి. అలాగే హైదరాబాద్, చెన్నై విమానాలు సైతం ఆలస్యంగా రానున్నాయి.
వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో పలువురు నిందితులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లకు విచారణార్హత లేదంటూ సోమవారం హైకోర్టు కొట్టివేసింది.
Chinna Jeeyar Swamy: ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా: గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి వీహెచ్పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణానికి నలువైపులా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్తో జాతీయ ఉద్యమం చేపట్టారు.
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు రిస్క్ తగ్గింపుపై మూడ్రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై వివిధ శాఖల అధికారులకు మూడ్రోజులపాటు అవగాహన కల్పించునున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీస్తున్నారు.. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. వైసీపీ నేతలను గుడివాడలో వరుస అరెస్ట్లు చేస్తున్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టులోకి ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు..