Home » Harish Rao
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు.
ఈడీ, ఐటీల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
తాజా రాజకీయ పరిస్థితులు.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకుగాను బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు జూలైలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచారని.. తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
నీట్పై నీలి నీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ హయాంలో విద్య కొందరి చేతుల్లోకి వెళుతోందన్నారు. వైద్య విద్య అంగట్లో సరుకైందన్నారు. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కులపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. నీట్ పైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ మోసం చేసిందని నిరుద్యోగ యువత ఆందోళన చేస్తోందని, యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు(Former minister Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నాడని, సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చక్రధర్ గౌడ్(Chakradhar Goud) అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.