Home » Heavy Rains
రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో పాఠశాల విద్యార్థి, అయ్యప్య భక్తుడి సహా నలుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో పది రోజుల కిత్రం ‘ఫెంగల్’ తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో పదిమంది మృతిచెందారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో ఉదయం నుంచే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్ తెలిపారు. అయితే గత 24 గంటలుగా అక్కడే స్థిరంగా ఉన్న అల్పపీడనం ప్రస్తుతం తీరం వైపు పయనిస్తోందన్నారు.
రాష్ట్ర తుఫాను చరిత్ర 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.500 కి.మీ దూరాన్ని మెల్లగా కదిలిన తుపానుగా ‘ఫెంగల్’ నిలిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం(Chennai, Chengalpattu, Cuddalore, Villupuram) మార్గాల్లో కదిలింది.
ఇటీవల సంభవించిన ఫెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు ఫోన్ చేసి ఆరా తీశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలు ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు మూడు జిల్లాలను ముంచెత్తాయి. విల్లుపురం, కృష్ణగిరి, కడలూరు(Villupuram, Krishnagiri, Cuddalore) జిల్లాల్లో 40 నుంచి 50 సెం.మీ.లకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆ జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
ఫెంగల్’ తుఫాను నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం అంతా వర్షం కురుస్తూనే వుండడంతో వాణిజ్య కేంద్రాలుండే టి.నగర్, పురుషవాక్కం, ప్యారీస్(T. Nagar, Purushavakkam, Paris) వంటి ప్రాంతాలు సైతం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.